*టి ఎస్ యు టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు.
మన్యం టీవీ ఏటూర్ నాగారం:
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏటూరునాగారం మండల ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.సోమవారం స్థానిక కె.జి.బి.వి పాఠశాలలో మండల కోశాధికారి పొడెం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అయన మాట్లడుతూ హెల్త్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ,మెడికల్ రియంబర్స్ మెంట్ కూడ వర్తించక ఆరోగ్య రక్షణ కొరకు ఉపాధ్యాయులందరూ ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నారు అన్నారు.అదే విధంగా పాఠశాలలో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి మినిమం బేసిక్ పే ఇవ్వాలని, రెగ్యులర్ మహిళా ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.కె.జి.బి.వి.పాఠశాల మరియు అందులో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు టిఎస్ యుటిఎఫ్ చేస్తున్న పోరాటంలో ఉపాధ్యాయులందరు భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పెనుగొండ యాకలక్ష్మి, ఉపాధ్యాయులు చుంచ రమాదేవి,పొడెం విజయ,గోండి స్వరూపరాణి, ఊకే ప్రశాంతి పాల్గొన్నారు.
Post A Comment: