CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా వర్సెస్ ఫారెస్ట్ శాఖ

Share it:

 


👉ఆ శాఖ తో అమీతుమీకి సిద్ధం.

👉ప్రభుత్వ భూములను సైతం అక్రమంగా  అక్రమించుకున్న ఫారెస్ట్ శాఖ

👉కొంత మంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు

👉ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుక వస్తే సహించేది లేదు

👉పోడు సాగు దారుల సమస్యలు ముఖ్యమంత్రి కి వివరిస్తా

👉మన్యం టీవి తో విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు

మన్యం టీవి, పినపాక:పోడు పోరు విప్ రేగా కాంతారావు వర్సెస్  ఫారెస్ట్ గా మారింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని  ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి తో విసుగు చెందిన పోడుసాగుదారులు వారి గోడును విప్ రేగా కాంతారావు కు వెళ్ల బోశారు.ముఖ్యంగా పినపాక మండలం అమరారం,భీమవరం, గోపాల్రావు పేట,తోగూడెం గ్రామాలు చెందిన పోడు సాగు దారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు ఫారెస్ట్ అధికారుల వేధింపుల ను వివరించారు.ప్రభుత్వ భూమి అని చెప్పినప్పటికిని ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా తమ భూములను లాక్కున్నారని ఆవేదన వెలుబుచ్చారు. తమ భూములను తమకు  ఇప్పించాలని పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి వినతిపత్రం అందజేశారు.కొంతమంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారి పై రేగా మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని, పోడు సాగు దారులకు అండగా ఉంటానని త్వరలోనే ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలువ నున్నట్లు ఆయన మన్యం టీవి కి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: