మన్యం టీవి,పినపాక:
రాష్ట్ర స్థాయి ఇన్సపైర్ ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ప్రకటించారు. ఈ జాబితాలో బయ్యారం ఎక్సెలెంట్ హై స్కూల్ విద్యార్థి జునైద్ ప్రదర్శించిన మోడీ ఫైడ్ మ్యాన్ హోల్ నమూనా రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విప్ , పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు రేగా కాంతారావు విద్యార్థులను, ఉపాధ్యాయులను , యాజమాన్యాన్ని అభినందించారు.
మోడీ ఫైడ్ మ్యాన్ హోల్ నమూనా విద్యార్థి మాటలో ప్రస్తుతం మనం మ్యాన్ హోల్ ఫైన మూతగా సిమెంట్ బ్లూక్ ని ఉపయోగిస్తున్నాము . దానివల్ల వర్షం వల్ల రోడ్ నీటితో నిండినప్పుడు నీటిని డ్రైనేజ్ లో కి పంపడానికి మ్యాన్ హోల్ పై మూతలా ఉండే సిమెంట్ బ్లాక్ని తొలగించవలసి వస్తుంది. ఈ క్రమంతో చాలామంది ఆ మ్యాన్ హోల్ లో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి మోడీ ఫైడ్ మ్యాన్ హోల్ తయారు చేసాను. మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమెంట్ బాక్ స్థానంలో లో మోడీ ఫైర్ మాన్ హోల్ పరికరాన్ని అమర్చాలి. ఈ పక్రియలో రోడ్డుపై పడ్డ వర్షపు నీరు జాలి ద్వారా మ్యాన్హోల్లో కి వెళ్తుంది. నీటి బరువుకి అక్కడ ఉండే పిస్టన్ కిందికి జరిగి నీరు వెళ్లే మార్గాన్ని ఏర్పరుస్తుంది నీరు తగ్గగానే మళ్లీ పిస్టన్ యధావిధిగా పైకి వస్తుంది. ఇది పూర్తిగా నీటి బరువు ఆదారంగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది.ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం లేకుండా రోడ్డుపై నీరు ఆగకుండా మ్యాన్హోల్లో కి వెళ్లిపోతుంది .ఈ విధంగా మ్యాన్హోల్ వల్ల జరిగే యాక్సిడెంట్ లను కూడా నివారించవచ్చు అని వివరించాడు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి పోషం నరసింహారావు , ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసుఫ్ షరీఫ్ , కరస్పాండెంట్ ఖాదర్ షరీఫ్ , డైరెక్టర్స యాకూబ్ షరీఫ్ , నరేందర్ ,ముక్కు వెంకట నర్సారెడ్డి, జె.ఎం.ఖాన్,లెనిన్,సురేష్ పాల్గొన్నారు.
Post A Comment: