👉జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి,
మన్యం టీవీ కొత్తగూడెం
కరోనా వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయినట్లు జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియను చేపట్టామని చెప్పారు. ఎంపిక చేసిన కేంద్రంలో 30 మంది చొప్పున మొత్తం 120 మంది వైద్య సిబ్బందికి వాక్సిన్ వేశామని చెప్పారు. వాక్సిన్ వేయు కార్యక్రమానికి ఎంపిక చేసిన కేంద్రాల్లో చక్కటి ఏర్పాట్లు చేసారని వైద్య సిబ్బందిని అభినందించారు. అలాగే వాక్సిన్ ప్రారంభ కార్యక్రమాన్ని పండుగగా నిర్వహించి విజయవంతం చేయడంలో బాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, సమన్వయం చేసిన అన్ని శాఖల అధికారులను, వాక్సిన్ యొక్క సమాచారం ప్రజలకు తెలియ చేయడంతో పాటు ప్రజలకు వ్యాధి సమాచారం ఇవ్వడంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సహకారంపై
పాత్రికేయులను
ప్రత్యేకంగా అభినందించారు. సకాలంలో వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు వాక్సిన్ తీసుకున్న సిబ్బందికి ఎటువంటి రియాక్షన్స్ రాకపోవడం చాలా సంతోషమని, ఇది చాలా శుభపరిణామని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తితో మలి దశలో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలును పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు వాక్సిన్ అందచేస్తామని చెప్పారు. మెదటి దశ వాక్సిన్ ప్రక్రియ ఇచ్చిన ఈ విజయం మరింత విశ్వాసం, నమ్మకాన్ని పెంచిందని ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తూ మరింత ముందుకు పోదామని, కరోనాను
జయిద్దామని చెప్పారు. ఈ మహాయజ్ఞానికి సహకారం, స్ఫూర్తి అందించిన ప్రతి ఒక్కరికి, టీకాలు తీసుకున్న వైద్య సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Post A Comment: