CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 29,30నఆదివాసీ హక్కులు, చట్టాలు, సంస్కృతి పై అవగాహన సదస్సును విజయవంతం చేయండి

Share it:

 


👉ఐలాపురం మిని గురుకులం లో రెండు రోజుల సదస్సు

👉 ముఖ్యఅతిథిగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, గిరిజన ప్రజాప్రతినిధులు

👉కరపత్రాలు విడుదల చేసినఎంపీపీ గుమ్మడి గాంధీ

మన్యం టీవీ, పినపాక:ఈ నెల 29, 30 న ఆదివాసుల హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రదాయాలపై మండల ఆదివాసి ఐక్యవేదిక ఆధ్వర్యంలోఐలాపురం మిని గురుకులం లో రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఎంపీపీ గుమ్మడి గాంధీ గురువారంకరపత్రాలు విడుదల చేశారు.పినపాకమండల పరిధిలోని పాండురంగాపురం  గ్రామంలో ఆదివాసి ఐక్యవేదిక మండల అధ్యక్షులు తోలెం శ్రీను అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీ లో రోజు రోజుకి కోయ భాష ఉనికి ప్రశ్నార్థకంగా గంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. ఆదివాసుల హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలని లక్ష్యంతో సదస్సు నిర్వహించ తలపెట్టడం అభినందనీయమన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,  పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన ఆదివాసీ ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని ,ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ మరియు సంస్కృతి సంఘం డివిజన్ అధ్యక్షులు పోలే బోయిన అనిల్ కుమార్ ఈసదస్సును ప్రారంభించనున్నారని  తోలేం శ్రీను తెలిపారు.సదస్సు విజయవంతం కోరుతూ రేపటి నుండి ఐదు రోజుల పాటు గ్రామ గ్రామాన  ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ కాయం శేఖర్ ,ఆదివాసి ఐక్యవేదిక నాయకులు జి కృష్ణ, కే కేశవరావు, కే నాగేంద్రబాబు, ఎస్ .అశోక్, రామనాథం, కే రాంబాబు, ముకేష్ ,శ్రీకాంత్ ,బాలు, రమేష్ తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: