గుండాల మన్యం టీవీ: కోవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చైతన్యవంతం చేసి కరోన మహమ్మారిని తరిమికొట్టాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి అన్నారు . గుండాల, ఆళ్లపల్లి మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తో కరోనా అంతం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కరోనా టీకా తయారు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామక్క, తాసిల్దార్ ఉషా శారద, ఎంపీడిఓ వెంకట్రావ్, వైద్యాధికారి రవిచంద్, సర్పంచ్ కోరం సీతారాములు, ఉప సర్పంచ్ ఉపేందర్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: