CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ పి హెచ్ సి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో( కోవిడ్ 19)డ్రై రాన్ కు ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ యం వి రెడ్డి పరిశీలన "

Share it:

    


    చండ్రుగొండ మన్యం టీవీ :చండ్రుగొండ మండలం శుక్రవారం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో డ్రైరాన్ ను అయన ఆకస్మికంగా పరిశీలించారు. చండ్రుగొండ పి హెచ్ సి లో డ్రైరాన్ విజయవంతం,   కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడం కోసం తీసుకొచ్చిన కోవిడ్-19 వ్యాక్సిన్ ను తొలి విడతలో 13వేల మంది వైద్య సింబ్బంది కి అందించటం జరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ యం వి రెడ్డి అన్నారు.ఆసుపత్రి  లో కలెక్టర్ కు శానిటేషన్ చేసి, వైద్య పరీక్షలు వైద్య సిబ్బంది నిర్వహించారు.వైద్య సిబ్బంది తో  నేరుగా ఆయన మాట్లాడారు.కరోనా వ్యాక్సిన్ పై అపోలుంటే వెంటనే తనకు చెప్పాలని కలెక్టర్ వైద్య సిబ్బంది తో అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతు.. జిల్లా లో 23 పిహెచ్ సి లో 23 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రలను ఏర్పాటు చేయటం వ్యాక్సిన్ ఇచ్చే తేదీలను ప్రకటించడం   జరిగిందన్నారు.తొలి విడత లో ఐ టీ సి, బి టీ పి యస్, సింగరేణి, ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రి లో పనిచేసే వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ను అందించడం జరుగుతుందన్నారు. వ్యాక్సి నేషన్ జరిగేటప్పుడు 7 పెద్ద ఆసుపత్రులులను అత్యవసర వైద్యం కోసం సిద్ధంగా ఉంచుతామన్నారు.కరోనా వ్యాక్సిన్ సేఫ్ అని ఎటువంటి అపోహలు పెట్టుకోవాదన్నారు.మండలానికి వచ్చిన కలెక్టర్ ను ప్రజాప్రతినిధులు, నాయకులు తమ సమస్య లను ఎకరువు  పెట్టారు. ఆసుపత్రి లో మంచి నీటి సౌకర్యం,  జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరి ఏర్పాటు చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్, కోవిద్ నియంత్రణ అధికారి చేతన్, ఎంపీపీ భానోత్ పార్వతి, జెడ్ పి టి సి కొనకళ్ల వెంకటరెడ్డి, సర్పంచ్ లక్ష్మీ భవాని, డాక్టర్స్ గీత, ప్రవీణ్, రాజేష్ నాయకులు వెంకట నారాయణ,  రసూల్, శేఖర్, ఎంపీటీసీ దారా బాబు,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: