మన్యం టీవి,పినపాక:
హోప్ చారిటబుల్ సొసైటీ ఖమ్మం ఆధ్వర్యంలో పినపాక మండలం మద్దల గూడెం, పాండురంగాపురం గ్రామాల్లో
డేకేర్ సెంటర్ లోని 150 మంది విద్యార్థులకు బియ్యం, దుప్పట్లు ,నిత్యావసరాలు, రాత పుస్తకాలు, పలకలు బొమ్మలు, తిను బండారాలు మొదలగు వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈసం భవతి, ఉప సర్పంచ్ సాంబశివరావు, డే కేర్ సెంటర్ సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: