మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను బుర్గంపాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,మరియు డైరెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా వారికి మన్యం మనుగడ డిసెంబర్ మాస పత్రికను అందజేయడం జరిగింది.అనంతరం మాన్యం టీవీ యప్ చాలా అద్భుతంగా ఉంది అని వార్తలు చాలా తొందరగా వస్తున్నాయి అని యప్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అన్నారు.ఈ సందర్భంగా ఆదివాసుల కోసం ఎమ్మెల్యే రేగా కాంతారావు మన్యం టీవీ ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అని ఆదివాసుల మనుగడకు,జీవన విధానం,హక్కుల కోసం మన్యం టీవీ ని ఏర్పాటు చేసిన విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,వైస్ చైర్మన్ కొమరం రాంబాబు,డైరెక్టర్లు, సకిని బాబురావు,కుంజ శ్రీనివాసరావు,తునికి సుజాత,బానోత్ శ్రీనివాస్, బిల్లం సాంబశివరావు, గుంపెన శ్రీనివాస్ ఉద్యమ కారులు పోడియం నరేందర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: