మన్యం టీవీ : జూలూరుపాడు,
మండల కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డు నందు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వీరబాబు, ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు, హమాలీ వర్కర్లకు, శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 46 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీధర్, సిహెచ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: