.
మన్యం టీవీ:కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గలోని కరకగూడెం మండల కేంద్రంలోని రాజ్యసభ సభ్యులు ఎంపి,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా మిఠాయిలు పంచడం జరిగింది.అనంతరం పార్టీ నాయకులు రావుల సోమయ్య,గుడ్ల రంజిత్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సంతోషన్న పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల వైస్ ఎంపీపీ పటాన్ ఆయూబ్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టుకొజుల వేణు,బొంగొని గణేష్,రావుల వేణు,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: