రెండు మండలాల స్థాయి వాలీబాల్ క్రీడాలను ప్రారంబించిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం టీవీ: కరకగూడెం.క్రీడలతోనే యువతకి మానసిక ఉల్లాసం పెరుగుతుందని ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు.అయన సోమారం కరకగూడెం మండలపరిదిలోని పాపాయిగూడెం గ్రామంలో ఎర్పాటు చేసిన కరకగూడెం,పినపాక మండలాల స్థాయి వాలీబాల్ క్రీడాలను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో యువత క్రీడాలపై ఎక్కువ మక్కువను రూపొందిచుకోవాలన్నారు.క్రీడలలో నైపుణ్యాన్ని పెంచుకుంటే ప్రభుత్వ రంగంలో పలు ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం పోందే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక స్థానిక సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ కరకగూడెం ఉపసర్పంచ్ రావుల రవి టిఅర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య కొంపెల్లి పెద రామలింగం క్రీడాకారులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: