మన్యం టీవీ మంగపేట.
నేడు పార్లమెంట్ సభ్యుడు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు స్పైసెస్ బోర్డు డైరెక్టర్ జీవియల్ నరసింహారావు మిర్చి సాగులో సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం పర్యటనలో బాగంగా వరంగల్ వస్తున్నట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి. సాంబశివరెడ్డి అన్నారు. మంగళ వారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సి.టీ.యఫ్.సి సమావేశం జరుగుతున్నదని, ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, రైతులు, ట్రేడర్స్, యన్ జివో, యప్ .పి.ఓ సభ్యులతో సమావేశం అవుతారని సాంబశివరెడ్డి తెలిపారు.చైర్మన్ రాకకోసం స్పైసెస్ బోర్డు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన వివరించారు.
Post A Comment: