CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు పద్మశ్రీ యడ్లపల్లి మంగపేటకి రాక

Share it:


మన్యం టీవీ మంగపేట. 


నేడు గురువారం పద్మశ్రీ  అవార్డు గ్రహీత,  రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి.వెంకటేశ్వరావు ములుగు జిల్లా, మంగపేట మండలంలో పర్యటించనున్నట్లు  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ  డైరెక్టర్  నాశిరెడ్డి. సాంబశివరెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం పద్మశ్రీ యడ్లపల్లి. వెంకటేశ్వర్రావు మంగపేట మండలం రాజుపేట లో  ఒక ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొంటారని  అనంతరం  అకినేపల్లి మల్లారంలో  "వికాస్ అగ్రి ఫౌండేషన్ " ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.మిర్చి పంటలను పరిశీలించి ఎంపిక చేసిన మిర్చి రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు  గోమాయ గోబర్ క్యాండిల్స్ పంపిణి చేస్తారని  సాంబశివరెడ్డి తెలిపారు.అనంతరం టి.కొత్తగూడెం గోదావరి తీరాన మత్స్య కారులను కలిసి వారితో మాట్లాడుతారని ఈ పర్యటనలో యడ్లపల్లి వెంట వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు, రైతులు పాల్గొటారని సాంబశివరెడ్డి  వెల్లడించారు...

Share it:

TELANGANA

Post A Comment: