👉గరికె ఉపేంద్ర రావు వీఆర్వో లరాష్ట్ర అధ్యక్షులు
మన్యం టీవి, హైదరాబాద్: తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మినీ హాల్ లో, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వి ఆర్ వో ల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమైనది, రద్దయిన విఆర్వో ల, అనంతర పరిణామాలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్వోల సర్దుబాటు, వారి భవిష్యత్తు పరిణామాల, పై సుదీర్ఘమైన సమాలోచన అనంతరం నిర్ణయాలు చేయుటకు మీరందరూ సకాలంలో హాజరై చర్చల్లో భాగస్వాములు కావాలని వారు కోరారు.
(1)వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే, రీ లొకేట్ చేయాలి
(2) వీఆర్వోల గత సర్వీసు కు భంగం కలగకుండా నిర్ణయించాలని కోరుతున్నాం
(3) సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని, అర్హతను బట్టి పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం
(4) వి ఆర్ ఎస్ ద్వారా పదవీ విరమణ చేయాలనుకునేవారికి అవకాశమిచ్చి వారి కుటుంబంలో లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి పెన్షన్ మంజూరు చేయాలని కోరడమైనది.
(5) నూతన జిల్లాల ఏర్పాటులో ఇతర జిల్లాలో ఉండిపోయిన వీఆర్వోలను వారి సొంత జిల్లాలకు పంపాలని
కోరడమైనది.
(6) మా సంఘ నాయకత్వంతో సి ఎస్ గారు సీఎం సమయం ఇచ్చి చర్చించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.హెచ్. సుధాకర్ రావు ,రాష్ట్ర కోశాధికారి
కోన బోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: