మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల కేంద్రంలో ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొమరం భీమ్ మండల స్థాయి 2వ క్రికెట్ టొర్నమెంట్ లో గెలుపొందిన సత్తిపండు సూపర్ కింగ్స్ జట్టుకు జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య అధ్వర్యంలో రూ.15వేలు, ఎంపీపీ ముత్తినేని సుజాత చెతులమీదుగా రన్నరప్ కట్టవారిగూడెం జట్టుకు రూ8వేలు ప్రైజ్ మనీ,షిల్డ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొసపాటి పిచ్చెశ్వరరావు,తెరాస మండల నాయకులు ముత్తినేని వాసు,వలబోజు మురళీకృష్ణ,టొర్నమెంట్ నిర్వాహకులు పాయం సత్యనారాయణ,పొడియం అనిల్,పాయం సర్వేశ్వరరావు,కల్లూరి నర్షింహరావు,వర్ష శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: