మన్యం టీవీ కొత్తగూడెం,
కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం ప్రజా సంఘాల నాయకులు వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ కచ్చితంగా స్థానిక పోస్ట్ ఆఫీస్ సర్కిల్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్తగూడెం ప్రజల చిరకాల ఆకాంక్ష కోరిక అయినటువంటి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో ఏర్పాటు చేసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ ను అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ వేల్పుల నరసింహారావు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగారావు బీసీ సంఘం నాయకులు దాసరి నాగయ్య సామాజిక చైతన్య కళా వేదిక అధ్యక్షులు సిద్దెల రవి జనసేన పార్టీ నాయకులు నవతన్ మరియు రమేష్ రజాక్ రవికుమార్ రేణుక కృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: