CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణలో ప్రత్యేక ఎస్టి కమిషన్ ఏర్పాటు చేయాలి

Share it:

 


ఆదివాసీ నవ నిర్మాణ సేన డిమాండ్

ఆదివాసీ నవ నిర్మాణ సేన మండల అధ్యక్షులు పోలేబోయిన భార్గవ్


నూగూరు వెంకటాపురం 


తెలంగాణ ప్రభుత్వం ఆదిమ తెగల పట్ల అలసత్వం వహిస్తోందని , తెలంగాణా లో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదివాసీ నవ నిర్మాణ సేన మండల అధ్యక్షులు పోలేబోయిన భార్గవ్ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన మీడియా కు తెలియ జేయటం జరిగింది. ఈ సమావేశం ఉపాధ్యక్షులు శరత్ కుమార్ అధ్యక్షతన చొక్కాలలో ఏ.ఎన్. ఎస్ .ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ ఉమ్మడిగా ఎస్సి, ఎస్టీ కమిషన్ ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ఎస్టీ లకు న్యాయం చేకూరటం లేదని ఆయన తెలియజేశారు. గతంలో కంటే నేడు ఎస్టీలు తీవ్ర  అన్యాయానికి గురి అవుతున్నారని అన్నారు., గిరిజనేతరుల నుండి  తరుచూ అనేక దాడులకు గురి అవుతున్నారు అని అన్నారు. అధికారుల చేత తీవ్ర వేధింపులకు గురి అవుతున్నారని తెలియజేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సి ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కేసులను అధికారులు అరకొర దర్యాప్తుల తో అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఏజెన్సీ లో ఆదివాసీల మీద అనేక అక్రమ కేసులు నమోదు అవుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ని ఏర్పాటు చేయటం ద్వారా ఎస్టీలకు సత్వర న్యాయం జరుగుతుందని అన్నారు.ఎస్సి, ఎస్టి కమిషన్   ఏర్పాటు జరిగి దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఒక్క ఎస్టి కి కూడా చైర్మన్ పదవి ఇవ్వకపోవడం  అత్యంత బాధాకరం అన్నారు.   సోలం చంటిబాబు , సోలం సుధాకర్,  మిచ్చ ప్రసాద్,పొడెం సురేష్,అట్టం నవీన్,శ్యామల.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: