CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

Share it:

 



మన్యం టీవి,హైదరాబాద్‌ : గల్ఫ్‌ కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం తాజా ఉత్తర్వులతో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని తొలగించి, కంపెనీలు తక్కువ వేతనాలకు కొత్త వారిని తీసుకునే ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు....


బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకమని తాజా ఉత్తర్వులతో మరోసారి నిరూపితమైందన్నారు. కేంద్రం పూర్తిగా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం తీసుకున్న వేతన తగ్గింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: