మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం, జానకీపురం గ్రామంలో సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.సిపిఎం పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి జంగిలి.వెంకటరత్నం అధ్వర్యంలో నిర్వహించిన,ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు అన్నవరపు.కనకయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు,మద్దతు తెలుపుతూ, సిపిఎం పార్టీ కార్యకర్తలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యకర్తల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి.శ్రీధర్,కుర్సం.బాబురావు,రైతు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: