మన్యంటివి,అశ్వారావుపేట: గిరిజనుల పోడు భూమి సమస్యలపై అశ్వరావుపేట మండల ఆదివాసి సర్పంచులు ఏకమయ్యి రేగా కాంతారావు ఆదేశాలు మేరకు సర్పంచుల సంఘం అధ్యక్షుడు సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో వినాయకపురం లో గిరిజన సర్పంచ్ లు మీటింగ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేగా కాంతారావు ఆదేశాలు కట్టుబడి ఉంటామని, పోడు భూముల జోలికి వస్తే ప్రజల సహకారం తో ఉద్యమనికి సిద్ధం, పోడు భూముల విషయం లో గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని వారు అన్నారు. ఇలా పలు అంశాలపై గిరిజన సర్పంచ్ లు చర్చించడం జరిగింది. ఈ సమావేశం లో వినాయకపురం సర్పంచ్ పొడియం సత్యవతి, అల్లిగూడెం సర్పంచ్ మొడియం కృష్ణ వేణి, కేశప్పగూడెం సర్పంచ్ బాబురావు, బచ్చు వారిగూడెం సర్పంచ్ కుంజా భవాని, పాత రెడ్డి గూడెం సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, నారాయణపురం సర్పంచ్ కంగాల పరమేష్, కన్నాయిగూడెం సర్పంచ్ లక్ష్మణ రావు, కోయ రంగాపురం సర్పంచ్ కంగాల గోవిందా రావు,నారం వారిగూడెం కాలనీ సర్పంచ్ నారం రాధ, దిబ్బగూడెం సర్పంచ్ కుంజా లక్ష్మి, అనంతరం సర్పంచ్ పాయం చిన్న కామయ్య మరియు గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: