మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామానికి చెందిన కొమరం జనార్ధన్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తాను జిహెచ్ఎంసి ఎన్నికలలో విరామం లేకుండా ప్రచారం చేస్తూ కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నేను ఉంటాను అని వెంటనే స్పందించి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధితుడు జనార్దన్ కు రూ.10 వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందించాలని ఆదేశించగా బుధవారం జడ్పిటిసి పొశం నరసింహారావు,కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ వారి ఇంటికి వెళ్లి రూ.10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఆపద అన్న వారికి ఆపద్బాంధవుడిలాగా ఒకవైపు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పేద మధ్యతరగతి ప్రజల అందజేస్తూ నియోజకవర్గ ప్రజలకు మనసున్న మహారాజుగా విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.
Post A Comment: