మన్యం టీవి, పినపాక:
ధరణి , ఎల్ అర్ ఎస్ ను రద్దు చేయాలి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర పిలుపు మేరకు త మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాశీల్దార్ ఉమామహేశ్వర రావు కు మెమోరాండం సమర్పించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నందున ధరణి మరియు ఎల్ అర్ ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా సన్న ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేదరమెట్ల శ్రీనివాసరావు, మండల వైస్ ప్రెసిడెంట్ ధర్మరాజుల శంకర్ ,మండల నాయకులు మండల నాయకులు నవి దశరథం, వేణు పాల్గొన్నారు .
Post A Comment: