మన్యం టీవీ ఏటూర్ నాగారం:
మండల కేంద్రంలో మేడారం ట్రోఫీ క్రీడలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రీడలు ఆదివారం ముగిసాయి క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఏఎస్పి గౌస్ ఆలం చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఖోఖో బాలికల విభాగంలో కస్తూరిబా పాఠశాల మొదటి బహుమతి పొందగా రెండో బహుమతి ఏటూరునాగారం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. వాలీబాల్ బాలురు మొదటి బహుమతి ఎక్కెల గెలుచుకోగా రెండో బహుమతి ఆకుల వారి గణపురం జట్టు కైవసం చేసుకుంది. కబడ్డీ బాలుర విభాగంలో ఆకులవారి గణపూర్ మొదటి బహుమతి గెలుచుకోగా రెండవ బహుమతి చిన్నబోయినపల్లి కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్ విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో తరుణ్ కుమార్ ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్ విజేతగా నిలిచాడు. రెండో బహుమతి ఎం కిరణ్ ఆకుల వారి గణపురం విజేతగా నిలిచాడు. మూడో బహుమతి నాగరాజు ఏటూరునాగారం గెలుచుకున్నాడు. 200 మీటర్ల పరుగు పందెంలో ప్రభాకర్ ఏటూరునాగారం స్పోర్ట్స్ క్లబ్ రెండో బహుమతి రాజు కోటి మూడో బహుమతి అన్నమయ్య గెలుచుకున్నారు. 400 మీటర్ల పరుగు పందెంలో మల్లికార్జున మొదటి బహుమతి రెండో బహుమతి గణేష్ మూడో బహుమతి నితిన్ గెలుచుకున్నారు.4x100లో గణేష్ మొదటి బహుమతి గెలుచుకోగా రెండవ బహుమతి భరత్ మూడో బహుమతి నాగరాజు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: