వెంకటాపురం(నూగూరు) డిసెంబర్ 12
నవంబర్ 23వ తేదీన గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జన్మదినం రోజున స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్ గా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. హైదరాబాద్ లోని DSS భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డును గురుకులాల కార్యదర్శి డాక్టర్.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా గిరిజన గురుకులాల తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం కాశయ్య, వెంకటాపురం మండల స్వేరోస్ నాయకులతో కలిసి అందుకున్నారు. గురుకులాల ఆవశ్యకతను మారుమూల ఏజన్సీ ప్రాంతాల్లో తెలియజేయడంలో వెంకటాపురం మండల స్వేరోస్ నాయకులు చేస్తున్న కృషిని డాక్టర్.ప్రవీణ్ కుమార్ అభినందించారు. పేద, గిరిజన బిడ్డలకు చదువే ఆయుధమని, ఏజన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ లేకుండా చూడాలని డాక్టర్.ప్రవీణ్ కుమార్ మండల స్వేరోస్ నాయకులకు సూచించారు. స్వేరో స్టడీ సర్కిల్స్ ద్వారా విలువలతో కూడిన విద్యను అందించి తద్వారా గిరిజన యువత ఉద్యోగ,ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేలా కృషి చేయాలన్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో స్వేరోస్ ములుగు జిల్లా అధ్యక్షులు బొట్ల ప్రశాంత్ స్వేరో, వెంకటాపురం మండల అధ్యక్షుడు కావిరి మహేశ్, వెంకన్న, బాలకుమార్ స్వామి, నాగేశ్వరరావు, చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: