మంగపేట మండలం తహసీల్దార్ కు వినతిపత్రం
రిజిస్ట్రేషన్ లేని ముక్కిడి పోశమ్మ ఇసుక క్వారీ సంఘం యొక్క తీర్మానం రద్దు చేయండి-పగిడిద్దరాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ సంఘం
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ కు పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క ఎస్టీ ఇసుక క్వారీ సంఘం ఆధ్వర్యంలో ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు, మాట్లాడుతూ వాడగూడెం లో నిర్వహించిన గ్రామసభ, చేసిన తీర్మానం పూర్తిగా అభ్యంతరకరం గా ఉందని, రిజిస్ట్రేషన్ లేని ముక్కిడి పోశమ్మ ఇసుక క్వారీసంఘంనకు తీర్మానం చేయటం మేము వ్యతిరికిస్తున్నాము, మాక్స్ రిజిస్ట్రేషన్ మరియు కోపరేటివ్ రిజిస్ట్రేషన్ సంఘానికి ఇసుక క్వారీ తీర్మానం చేసి ఇవ్వాలి 1964 సంవత్సర చట్టంసంఘం ప్రకారం రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క ఎస్టీ ఇసుక క్వారీ సంఘం అన్ని అర్హతలు కలిగి ఉన్న సంఘం ని కాదని రిజిస్ట్రేషన్ లేని సంఘాలకు తీర్మానం చేయడం, 1995 మాక్స్ రిజిస్ట్రేషన్ చట్టప్రకారం చెల్లదు, కాబట్టి వెంటనే వాడగూడెం గ్రామం లో మరల గ్రామ సభ పెట్టి పెసా చట్టం ప్రకారం కోరం ఉండేలా, మెజారిటీ ఆదివాసీ ప్రజల నిర్ణయం ఆధారంగా ఇసుక క్వారీ తీర్మానం చేసి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని వాసం బుచ్చయ్య, పాయం శ్రీనివాసరావు, మడివి సతీష్ తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ను కోరారు.
Post A Comment: