యువతకి వాలీ బాల్ కిట్లు అందజేసిన అమ్మ స్వచ్చంద సేవా సంస్థ
అమ్మ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు పీర్ల కృష్ణ బాబు
వెంకటాపురం(నూగూరు)
గత కొన్ని నెలలుగా కోవిడ్ వ్యాధికి గురి అయిన అనేకమంది పేదలకు నిత్యవసర సరుకులు కరోనా కిట్లు అందజేశారు. ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఎక్కడ, ఎప్పుడు, ఏ అవసరం ఉన్న తాను ఉన్నానని అమ్మ స్వచ్చంద సేవా సంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. శుక్రవారం నాడు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆర్ల గూడెం , దానవాయి పేట ,బొమ్మన పల్లి యువతకి వాలీ బాల్ కిట్లు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ మా అమ్మ స్వచ్చంద సేవ సంస్థ ఇప్పటి వరకు ముడు వేల మందికి కరోనా సహాయం అందించాం అని తెలియ జేశారు. ఆటలు ఆడటం వల్ల అనేక ఆరోగ్య పరమైన లాభాలున్నాయని అన్నారు. ఆటలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని ,ఉత్సాహాన్ని కలిగిస్తాయని అన్నారు. అమ్మ స్వచ్చంద సేవా సంస్థ ఆపదలో ఉన్న వారికీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ రెండవ దశకి చేరిందని అన్నారు. చలికాలం కాలం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజాగ్రత గా ఉండటం వల్ల ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు.
Post A Comment: