మన్యం టీవీ కొత్తగూడెం
కొత్తగూడెం బర్మా క్యాంప్ ప్రాంతనికీ చెందిన రామస్వామి అనే రోజు కూలి కుమారుడు సతీష్ గత కొంత కాలంగా వెన్నుపూస విరిగి బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మణుగూరు హెల్పింగ్హ్యాండ్స్ స్వచ్ఛంద సేవ సమస్త అధ్యక్షులు యలగల నవనీత్, ఉపాధ్యక్షులు విత్తనాల సుధీర్లు వారి నివాసానికి వెళ్లి రూ. 20వేలు 50 కేజీల బియ్యం ఆర్థికసాయంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సతీష్ వెన్నుపూస విరిగిపోయి బాధపడుతున్న విషయం తెలియగానే తమ శక్తి మేర ఆర్థికసాయం అందజేశామన్నారు. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా హెల్పింగ్హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్సింగ్హ్యాండ్స్ సభ్యులు వరుణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: