మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో గల కెఎస్ఎల్ గోదాంలో 11 బ్లూ స్టార్ ఏసీలు దొంగిలించారని మహమ్మద్ ఇసాక్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఫిర్యాదు మేరకు మణుగూరు సీఐ భానుప్రకాష్ దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా సీఐ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారంతో సోమవారం ఉదయం చిక్కుడు గుంట గ్రామంలో రూ.5లక్షల 64వేల విలువ గల 11ఏసీ లు స్వాధీనం చేసుకొని దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలు బట్టి.గణేష్, పడిగెల.జగపతి బాబు,పడిగెల. ఆదినారాయణ,మునిగెల.ఉదయ్,గుండారపు మురళి, మునిగేలా.అరుణ్ కుమార్, మునిగెల.నవీన్,చిక్కుడుగుంట అను వారిని అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ భాను ప్రకాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లో ఎస్సై. కె.నరేష్,సిబ్బంది షమీమ్, మోహన్,మల్సూర్, వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు.
Post A Comment: