👉మణుగూరు టిఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో
👉ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు*
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని గుట్ట మల్లారం లో గల హనుమాన్ గార్డెన్స్ లో శనివారం మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు అధ్యక్షతన మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు.ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ నియోజకవర్గ లీగల్ అడ్వైజర్ గా పోనుగోటి కిషన్ రావు ను నియమిస్తున్నట్లు తెలియజేసారు.నియజకవర్గ మరియు బూత్ స్థాయి కమిటీ నుండి పార్టీని బలోపేతం చేయాలని, మహిళలను భాగస్వామ్యం చేయాలి అని కార్యకర్తలు అందరూ ప్రోటోకాల్ పాటించాలి అన్నారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.ఎన్నిక ఏదయినా టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలలో చైతన్యాన్ని,యువజన నాయకులలో ఉత్సాహన్ని నింపారు.పార్టీ నాయకులను కార్యకర్తలను,యువజన నాయకులను,ఉద్యమ కారులను కన్న తండ్రిలా కాపాడుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేసారు ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలి అని విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు.పార్టీ బలోపేతానికి చేయవలసిన మరియు పాటించవలసిన విధి విధానాలను వివరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కె వి రావు,టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వుకంటి ప్రభాకర్ రావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,మండల అధ్యక్షురాలు,పాకాల రమాదేవి,టౌన్ అధ్యక్షురాలు,తుంగల చంద్రకళ,నియోజకవర్గ లీగల్ అడ్వైజర్,పోనుగోటి కిషన్ రావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, మండల,టౌన్ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, హర్షవర్ధన్,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: