ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే గిట్టుబాటు ధర
: ఎంపీపీ గుమ్మడి గాంధీ,పినపాక సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ.
మన్యం టీవి, పినపాక:ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది ఎంపీపీ గుమ్మడి గాంధీ,పినపాక సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గడ్డంపల్లి,పినపాక,చెగర్శల గ్రామాలలో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ,వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, సర్పంచ్ లు జి.నాగేశ్వరరావు, గొలుసుల నాగేశ్వరరావు, ఎంపీటీసీలు సిహెచ్ .సత్యం, సోలం కృష్ణకుమారి,ఎగ్గడి ఉమాదేవి, సొసైటీ డైరెక్టర్ లు పటేల్ కామేష్, గుణ గంటి సమ్మయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, బొలిశెట్టి నరసింహారావు, పడిగ నాగయ్య, బుర సురేష్,ఎగ్గడి సత్యనారాయణ,సోం పెల్లి తిరుపతి, ఏల్లు సత్తిరెడ్డి, యాంపాటి సందీప్ రెడ్డి, సొసైటీ సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: