మన్యం టి. వి న్యూస్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ సమీప అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభినవ్ అభిలాష తనిఖీ చేశారు ఉపాధిహామీ కూలీలతో కాసేపు ముచ్చటించారు ఏ సమయం నుండి ఏ సమయం వరకు పని చేస్తున్నారు అని అడిగారు అందుకు బదులుగా కూలీలు ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల చేస్తున్నాం అని బదులిచ్చారు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు చాలా బాగా పని చేస్తున్నారు నాకు ఇంత మంది కూలీలను చూస్తుంటే ఆనందంగా ఉందని పొగిడారు వీరి వెంట గ్రామ సర్పంచ్ ఈసం సంధ్య ఏం. పి.డి.ఓ స్వరూప ఈ. ఓ.పి.ఆర్.డి కృష్ణ ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి రమేష్ కరొబార్ లక్ష్మయ్య తదితరులు ఉన్నారు
Post A Comment: