CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు వేదికల పరిశీలన

Share it:



మన్యం టీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా మంగపేట మండలంలోని వివిధ గ్రామాలలో రైతు వేదిక నిర్మాణాలను జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య సందర్శించి పరిశీలించారు. జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు పల్లా బుచ్చయ్య మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ రైతులను సంఘటితం చేసే ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషింత  దగిన విషయం. రైతు మేలు కోరే ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు రానటువంటి ఇంత మంచి ఆలోచనలు దేశంలోనే ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు. 

మండలంలో అన్ని రైతు వేదికలు చివరి దశకు వచ్చాయి. అని మిగతా పనులు అతి త్వరలో పూర్తి కానున్నాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందా నాయక్, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ తోట రమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సిద్ధం శెట్టి వైకుంఠం, జిల్లా జీవ వైవిద్య సభ్యుడు కర్రీ శ్యాం బాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: