CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాము: అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు

Share it:


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బీటీపీఎస్ రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా మంగళవారం సాంబయి గూడెం,రామానుజవరం గ్రామం లో మణుగూరు తహసీల్దార్ రుధర్ విల్సన్ అధ్యక్షత న గ్రామసభ నిర్వహించారు. సామాజిక ఆర్థిక సర్వే నిమిత్తం నిర్వహించిన ఈ గ్రామ సభలో తొలుత జిల్లా ప్రాజెక్టు పరిపాలనా మరియు అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు భూసేకరణలో భూములు కోల్పోతున్న సుమారు మూడు వందల మందిని వారి పేర్లు చదివి వినిపించి పిసా, ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలైన్ నిర్మాణం లో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు.ఎవరివైనా పేర్లు వివరాలు నమోదు లో తప్పులు దొర్లితే దరఖాస్తులు అందజేసి వెంటనే సవరించుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,  ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పాయం లక్ష్మయ్య, సర్పంచ్ లు కాయం తిరుపతమ్మ,కురసం రాంబాబు,బాడిశ సతీష్, సెక్రెటరీ సునీత, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,రెవెన్యూ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: