మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి .. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి
మన్యం టీవి:
వెంకటాపురం(నుగునూరు) మండలం లోని మరికాల సమీపంలో గల గోదావరి నదిలో పడి నలుగురు దళిత యువకులు మృతి చెందటం పట్ల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి వారి కుటుంబాలను పరామర్శించి సంతాపం వెలుబుచ్చారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు,ప్రతీ కుటుంబానికి 25 కేజీల రైస్ అందజేశారు.
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.,బి.సి సెల్ అధ్యక్షులు పల్నాటి నాగేశ్వరరావు, ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ పిఎసిఎస్ అధ్యక్షులు మోహన్ రావు, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాంబశివరావు,ఎంపీటీసీ రవి, సునీల్ మన్యం, రమేష్ సురేందర్, చిట్టెం టాకయ్య,చిట్టెం శ్రీనివాసరావు, చిట్టం శ్రీనివాస్ ,సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: