మహాముత్తారం: తాము ఏం చేసినా అడిగే వారు లేరనుకున్నారేమో కొందరు యువకులు తాగిన మైకంలో రోడ్డుపై బీరు సీసాలు విసురుతూ ఆటోట్రాలీలో దూసుకెళ్లారు. దీన్ని గమనించిన స్థానిక ప్రజాప్రతినిధి వారి ఆకతాయి చేష్టలను అడ్డుకోవడంతోపాటు తగిన గుణపాఠం చెప్పారు. బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంట మీదుగా మేడారం నుంచి సిరోంచకు ఆటోట్రాలీలో వెళ్తున్న ఐదారుగురు యువకులు తాగిన మైకంలో ఖాళీ బీరు సీసాలను రోడ్డుపై విసురుతూ, కేకలు పెడుతూ వెళ్లారు. అక్కడే ఉన్న కొర్లకుంట సర్పంచ్ ముక్కెర నవీన్గౌడ్ వారిని వెంబడించి కాటారం మండలం చింతకాని వద్ద వారి వాహనాన్ని అడ్డుకున్నారు. వారిని కొర్లకుంటకు తీసుకొచ్చి రోడ్డుపై బీరు సీసాల ముక్కలను చీపురుతో ఊడిపించారు. ఆకతాయిలకు బుద్ధిచెప్పిన సర్పంచ్ను స్థానికులు అభినందించారు
Navigation
Post A Comment: