మన్యం టీవీ,అశ్వాపురం :కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య కార్మిక సంఘాలు ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త సమ్మె లో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్ పిలుపు నిచ్చారు శుక్రవారం ఉదయం అశ్వాపురం ఆటో స్టాండ్ వద్ద సమ్మె ప్రచారం లో భాగంగా బోళ్ల రమణయ్య అధ్యక్షతన జరిగిన అడ్డా సమావేశంలో ప్రసంగించారు ఈ కార్యక్రమం లో యూనియన్ అధ్యక్షులు బాగోతపు సతీష్ మర్రి నాగరాజు నాయకులు కొమ్ము రాంబాబు హుస్సేన్ పండు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: