మన్యంటివి, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీలో కొండతోగు గ్రామం లో వున్న పల్లె పకృతి వనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ నారం రాజశేఖర్ అన్నారు. సర్పంచ్ రాజశేఖర్ పల్లె పకృతి వనంలో మొక్కలు పరిశీలించి మొక్కలకు నీళ్ళు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనం లో రకరకాల అందమైన మొక్కలు నాటి ఆహ్లాదకరంగా సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రజలు పల్లె పకృతి వనంలో స్వేద తీరేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో సెక్రటరీ గంగుల రవి, ఏపిఓ శ్రీనివాసరావు, గుమస్తా మంగరాజు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: