మన్యం టీవీ : జూలూరుపాడు,
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి, ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో నర్సరీలలో మొక్కల పెంపకం పనులు ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో రామారావు, పర్యవేక్షణలో గ్రామపంచాయతీ సర్పంచుల, సమన్వయంతో పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో జమీర్ పాష, సిబ్బంది, నర్సరీలకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఆదివారం సాయిరాం తండా సర్పంచ్ ధారావత్ రోజా, ఆధ్వర్యంలో నర్సరీలలో మొక్కల పెంపకానికి అవసరమైన. నాణ్యమైన మట్టిని కూలీలతో పాలిథిన్ సంచుల్లో నింపారు. పనుల వేగవంతం పై యంత్రాంగం దృష్టిసారించింది.
Post A Comment: