మన్యం టీవి, పినపాక:మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సభ్యులు వల్లేపోగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి కృషి చేయాలన్నారు. దళిత గిరిజన, వెనుకబడిన తరగతుల వారు ఉద్యోగాలు అడిగే రోజుల నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి వరకు ఎదగాలన్నది అంబేద్కర్ ఆశయ మన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దల హుస్సేన్, కోలిపాక నాగేశ్వర రావు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: