మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలూరుపాడు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కార్యాలయంలో 67వ, "సహకార సంఘ వారోత్సవాల" సందర్భంగా శనివారం సంఘం ఉపాధ్యక్షులు చీమలపాటి బిక్షం సహకార జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి లక్ష్యంగా సంఘం ముందుకు సాగుతుందని ఆన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మనుబోలు తిరువెంగళరాజు, సొసైటీ సీఈఓ ఎన్ వి రమణరెడ్డి, సొసైటీ సిబ్బంది జి వెంకటేశ్వర్లు, కె ప్రసాద్ రావు, ఎస్ అమల, టి సునీత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: