- తుపాన్ ధాటికి రైతన్న విల విల
- గురువారం నుండి మొదలు ఎడతెరిపి లేని వర్షం
- కుప్పలు కుప్పలు తడిసిన ధాన్యం రాసులు
- రైతులకు భారీ పంటనష్టం
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలకేంద్రంలో 23 రెవిన్యూ గ్రామాలున్నాయి.మండల కేంద్రంలో ఎక్కడ చూసిన తడిసిన ధాన్యపు రాసులే... ఈ.నివర్ తుపాన్ దెబ్బకు దేశానికి అన్నం పెట్టే రైతు , ఈ రోజు కన్నీళ్లు పెడుతున్నాడు, దేశానికి వెన్నుముక మన రైతన్న, అటువంటి రైతన్న ఇప్పుడు వెన్నుముక వంగి నేల చూపులు చూస్తున్నాడు దానికి గల కారణం ఎక్కడ చూసిన కుప్పలు కుప్పలు గా తడిసిన ధాన్యం రాసులు దర్శనంఇస్తున్నాయి. ధాన్యం రాసుల మీద నీటిని పొద్దందాకా ఎత్తిపోసిన కూడా నీరు వొడవది వర్షం తగ్గదు. పంటనష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనాకు కూడ అందే పరిస్థితి లేదు వర్షం ఎడతెరిపి లేకుండా కురవడం వలన రైతన్నల ఆందోళన అంతా ఇంత కాదు ఈ రోజు తో అయినా వర్షం తగ్గి పొతే బాగుండు అనే ఆశతో పడుతున్న వర్షపు నీటిని ఇంకా ఎత్తి పొసే పనిలో నిమగ్నమయ్యారు.
Post A Comment: