రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లు గా నియమితులైన సారయ్య, గోరేటి వెంకన్న, దయానంద్ లు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతులమీదుగా మండలిలో ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు బంగారు తెలంగాణ సాధనలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ ఎమ్మెల్సీల రాకతో ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. మంచిగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు
Navigation
Post A Comment: