మన్యం టీవీ మంగపేట.
నవంబర్ 26 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె దేశ బంద్ ను విజయవంతం చేయాలని టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మరావు పిలుపునిచ్చారు.మండలం లోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గొప్ప సమ్మరావు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి దూపటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్పీని వెంటనే ప్రకటించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బదిలీలు పదోన్నతులు చేపట్టాలని పండిట్ పిఈటి పోస్టులను అఫ్ గ్రేడ్ చేయాలన్నారు.టిఎస్ యూటి ఎఫ్ మంగపేట మండల కమిటీ ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా కాక సమ్మయ్య ప్రధాన కార్యదర్శిగా ములకల వెంకట స్వామి తదితరులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పొడెం సమ్మయ్య,జిల్లా కార్యదర్సులు చెంచయ్య,భాస్కర్ రావు, పాల్గొన్నారు.
Post A Comment: