మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం క్లబ్ నందు "జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పరిరక్షణ కమిటీ" దిశ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాములు నాయక్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ పోస్టులు భర్తీ చేయాలని, 108 సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలకు ఆరోగ్య కేంద్రంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని,ఈ సమావేశంలో సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్, మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.
Post A Comment: