మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం పరిధిలో గ్రామాలు అయిన నెల్లిపాక బంజరు గ్రామము లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్ పి టి సి సూదిరెడ్డి సులక్షణ ప్రారంభిచారు. ఈ సందర్భంలో తను మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు.రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు అనే ఉద్దేశంతోముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.రైతులకు మద్దతు ధర ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ , వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి ఎ తాతారావు, ఏ ఓ సాయి శంతాన్ కుమార్, ఏఈఓ,సంఘం డైరెక్టర్లు మరియు రైతుసంఘం నాయకులు,గ్రామ రైతులు మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: