నివర్ తుఫాన్ ప్రభావంతో తడసి ముద్దయిపోయిన వరి పంటలను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట,చేతికి దక్కకపోవడంతో సంతోషానికి దూరమైన రైతులు..
మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 28): అన్నపురెడ్డిపల్లి మండలం లోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,నష్టపోయిన రైతుల పంటలను నేడు పరిశీలించారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాణావత్.భీముడు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన రైతులు ఎప్పటికీ కష్టనష్టాలు పడుతూనే ఉన్నారని,వారి ముఖాల్లో సంతోషానికి చోటు లేకుండాపోయిందని వ్యాఖ్యానిస్తూ,మండలంలో కొంతమంది రైతులు కష్టించి పండించిన పంటలు,హార్వెస్టర్ యంత్రాల ద్వారా వరికోత కోయకుండా,పశువుల మేత కోసం చేతికోతలు కోసి పనలు వేసుకున్నారని,వాటిని గూడువేసుకునే సమయానికి నివర్ తుఫాను రావటం వల్ల పనులు మొత్తం తడిసి ముద్దయి,రైతులకు కన్నీళ్లు మిగిల్చాయ్ అన్నారు.నష్టపోయిన రైతులను,ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పెంకె.మల్లయ్య,చల్లా.పుల్లయ్య,రైతులు కాళోజు.కృష్ణయ్య,కాళోజు.నరసింహ,సంఘసాని.నగేష్,రింగు.కృష్ణ,ఇస్లావత్.బాలాజీ,బండి.కృష్ణయ్య,చిట్టిబొమ్మల.మురళి,రాముల.కృష్ణ, సంఘసాని.దుర్గయ్య,సంఘసాని.సునీత,సంఘసాని.లక్ష్మి,ఇనపనూరి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: