మన్యం టీవీ : జూలూరుపాడు, ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు కొత్త ఓటర్ల నమోదు కోసం నవంబర్ 21,22 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం ద్వార జూలూరుపాడ్ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, 18 సంవత్సరాలు పైబడి అర్హులైన యువతీ, యువకులు, అందరూ ఓట్లు నమోదు చేసుకోవాలని జూలూరుపాడ్ తహసీల్దార్ పిఎల్ఎన్ ప్రసాద్ కోరారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో మండలం లోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకొని వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటరు జాబితా లో తపోప్పులు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓ ల దృష్టికి తీసుకు వెళ్లాలని, పోలింగ్ కేంద్రలవద్ద ఓటరలిస్టు అందుబాటులో ఉంటుందని, తహసీల్దార్ తెలిపారు. ఈ అవకాశాన్ని యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నాయకులు, గీర్దావర్లు మందుల.రవి,వీరభద్రం, విఆర్వో కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: