మన్యం టీవి, తాడ్వాయి:ఈరోజు ఉదయం 8:30 నుండి మేడారం సమ్మక్క సారక్క గద్దెల గేట్లు ఓపెన్ చేయడం తో భక్తులు దర్శనం లు పునర్ ప్రారంభం అయ్యాయి. కోవిడ్ -19 వైరస్ ప్రభావం తో గత కొన్ని నెలలు గా గద్దెల గేట్లు తాళం వేసి ఉంది. ఈ సందర్బంగా మేడారం సమ్మక్క సారక్క ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు చేర్ప రవీందర్ బుధవారం గేట్ల తాళాలు తెరిచారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి ని దర్శించుకొని సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. మేడారం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని మేడారం సమ్మక్క సారక్క ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ కోరింది.
Navigation
Post A Comment: