గుండాల మన్యం టీవీ: ఆళ్లపల్లి మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం దగ్గర నుండి వెంకటాపురం వెళ్లే మార్గంలో బందెల దొడ్డి వరకు రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక దృష్టి సారించి 1100 మీటర్లకు రూ. 58 లక్షల నిధులు మంజూరు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ మండల నాయకులు గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించి రేగా కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీలోని రోడ్లకు, వాగులపై వంతెన లకు మోక్షం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కార్యదర్శి ఎస్కె బాబా, మండల నాయకులు ఖయ్యుం, నరెడ్ల ప్రవీణ్, నగేష్, ముడిగ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: